Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పేదలు చనిపోవడానికి కారణం చంద్రబాబే.. జోగి రమేశ్‌

నిన్న గుంటూరు వికాస్‌ నగర్‌ లో చంద్రబాబు తలపెట్టిన మహాసభలో ముగ్గురు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో పేదలు చనిపోవడానికి కారణం చంద్రబాబేనని మంత్రి జోగి రమేశ్‌ అన్నారు. ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్‌ స్పందిస్తూ..రాష్ట్రంలో చంద్రబాబు సభలకు అనుమతులు ఇవ్వకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలలో ఇటీవల మరణించిన వారందరినీ చంద్రబాబే హత్య చేసినట్లుగా వర్ణించారు. నాలుగు రోజుల క్రితమే 8 మందిని బల్లి తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు మరో ముగ్గురిని పొట్టను పెట్టుకున్నారని విమర్శించారు. నూతన సంవత్సరం రోజు విషాదాన్ని మిగిల్చారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img