శ్రీకాకుళం జిల్లా పొందూరులో జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనాన్ని నిర్మలా సీతా రామన్ సందర్శించారు. నంతరం చేనేత కార్మికులతో కలసి వారి స్థితిగతులను మంత్రి నిర్మలా తెలుసుకున్నారు. 30 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న చేనేత కార్మికుల భవనానికి మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు కే రామ్మోహన్ నాయుడు, బెందాలం చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ , జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.