Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌
పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమీక్ష చేపట్టారు.సీఎం జగన్‌తో కలిసి పోలవరం పరిసర ప్రాంతాల్లో షెకావత్‌ పర్యటించారు. ఇందుకూరు`1లో ఆర్‌ అండ్‌ ఆర్‌ పునరావాస కాలనీ, ఏనుగులగూడెంలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నిర్వాసితుల పునరావాస కాలనీని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో షెకావత్‌ మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని అన్నారు. పునరావాస కాలనీని పరిశీలించానని, వసతులు బాగున్నాయని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అని, పోలవరం పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img