పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్-3 నిర్మాణం పూర్తయ్యింది. పోలవరం ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గ్యాప్-3 కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్లో కీలకమైన ఈ గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేసింది.