ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. ఆయన గురువారం పార్లమెంట్లోని మీడియాలో పాయింట్లో మీడియాతో మాట్లాడారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని కేంద్రానికే ఎక్కువ బాధ్యత ఉంటుందని స్పష్టంచేశారు. సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని కోరారు. పోలవరం హెడ్ క్వార్టర్స్ను రాజమండ్రికి మార్చాలని డిమాండ్ చేశారు. పోలవరం బకాయిలను కేంద్రం తక్షమే విడుదల చేయాలని డిమాండు చేశారు.