Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజలంతా అమరావతి వైపే : సోమిరెడ్డి

ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో సభ విజయవంతమైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.అకుంఠిత దీక్షతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభం నుంచి సభ వరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా అండగా నిలవడం విశేషమని ట్వీట్‌ చేశారు. తిరుపతిలో అమరావతి సభ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఒక్క వైసీపీ తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు రాజధాని రైతులకు జైకొట్టాయని, అధికార వైసీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎన్ని కేసులు బనాయించినా, ఆటంకాలు సృష్టించినా ప్రజలంతా అమరావతి వైపే నిలిచారని పేర్కొన్నారు. కేంద్రంలో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న బీజేపీ ప్రభుత్వమే రైతుల పోరాటానికి తలొగ్గి మూడు కీలక బిల్లులను వెనక్కి తీసుకుంది.ఇక్కడేమో రైతులు నెలల తరబడి దీక్షలు చేసినా, వందల కిలోమీటర్లు నడిచినా జగన్మోహన్‌రెడ్డి మనస్సు కరగకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇకనైనా అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img