Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రజలు సంతోషంతో చెప్పే మాటలే మా ప్రభుత్వానికి ఆక్సిజన్‌

కొత్త లబ్దిదారులకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌
ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంతో చెప్పే మాటలే తమ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ అని సీఎం జగన్‌ అన్నారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందనివారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే లబ్ది చేకూరేలా ఏపీ ప్రభుత్వం కొత్త కార్యాచరణ తీసుకురావడం తెలిసిందే. దీని ప్రకారం సంక్షేమ పథకాలకు కొత్తగా అర్హులైన వారికి సీఎం జగన్‌ నేడు నిధులు విడుదల చేశారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 3.40 లక్షల మంది నూతన లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.137 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోరాదన్న ఉద్దేశంతో అర్హులైన లబ్దిదారులను గుర్తించి నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడిరచారు. అర్హత ఉన్నవాళ్లు పథకాలకు దూరం కాకూడదని భావించి తమ ప్రభుత్వం పడుతున్న తాపత్రయానికి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఒక నిదర్శనం అని పేర్కొన్నారు. కులం, మతం, వర్గం, పార్టీ చూసుకోకుండా పథకాలను ఇంటివద్దకే అందిస్తున్నామని, తద్వారా ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పథకాలను ఎలా కత్తిరించాలి? ఎలా కోత విధించాలి? అని ఆలోచించేదని, ..పలు విధాలుగా పథకాలు ఎగ్గొట్టేవారని సీఎం జగన్‌ వివరించారు. గత ప్రభుత్వంలో లంచాలు ఇస్తేనే ప్రభుత్వ పథకాలు అందేవని, ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇప్పటి పాలనలో మనసు ఉందని స్పష్టం చేశారు. తాము అన్నింటికీ అతీతంగా, కుల, మత, వర్గ, రాజకీయాలు చూడకుండా ప్రజలకు లబ్ది చేకూర్చుతున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img