Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరు : చంద్రబాబు

ఏపీ ప్రజలందరూ అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్నారని మహా పాదయాత్రకు లభిస్తోన్న మద్దతు చూస్తే తెలుస్తోందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎంత దౌర్జన్యం చేసినా ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరని స్పష్టం చేశారు. అంతిమ విజయం ప్రజలదేనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రైతుల మహోద్యమం 700 రోజులకు చేరిందని, మహా పాదయాత్ర కూడా 16వ రోజుకు చేరుకుందని పేర్కొన్నారు. ఉద్యమంలో అమరులైన 189 మంది రైతులకు నివాళులర్పించారు. రైతుల పాదయాత్రపై ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు పెడుతోందన్నారు. మద్దతు తెలిపిన ప్రజలపై లాఠీచార్జ్‌ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img