:పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
విశాలాంధ్ర – యస్. రాయవరం : ప్రజా సమస్యల పరిష్కరం కోసమే ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం రామయ్యపట్నం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తాగునీటి సమస్య, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం సచివాలయం సిబ్బందితో పలు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డీ సత్యనారాయణ, వైసీపీ నాయకులు పొలిశెట్టి పెద ఈశ్వరరావు, రామచంద్రరాజు, వైబోయిన సత్యనారాయణ, లోవరాజు, గురునాథరావు తదితరులు పాల్గొన్నారు