పదేళ్ల్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని విభజన చట్టం చెప్పిందని, అంతేగానీ తాము హైదరాబాద్ వెళ్తామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా వ్యంగ్యంగా మాట్లాడుతుండటం బాధాకరమన్నారు. అమరావతి రాజధాని అని కేంద్రానికి పంపి అప్పుడే ఆమోదింప చేసుకుని ఉండాల్సిందని, చంద్రబాబు అలా చేయలేదన్నారు. సీఆర్డీఏ చట్ట ప్రకారం ల్యాండ్ పూలింగ్ హామీలను నెరవేర్చుతామని, దీనికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.