Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రతి పల్లె తిరుగుతా..అన్నీ ప్రక్షాళన చేస్తా : చంద్రబాబు

పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతి పల్లె తిరుగుతా అన్నీ ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. కుప్పంలోని దేవరాజపురంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో 2019 నుంచి అరాచక పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.. ప్రజలను జగన్‌రెడ్డి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఓటీఎస్‌ ఎవరూ కట్టొద్దు.. టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితం చేస్తామని ప్రకటించారు.దోచుకున్న డబ్బులను ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టారని ఆరోపించారు. సీఎం జగన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు హెచ్చరించారు. తన కార్యకర్తపై దెబ్బ పడిరదంటే అది తనమీద పడినట్టేనని చంద్రబాబు తెలిపారు. తాను ఎవరినీ వదలి పెట్టానని హెచ్చరించారు. వైసీపీ ఒకింత ఇబ్బందులు పెడితే తాను పదింతలు ఇబ్బందులు పేడతానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img