Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రధానికి, ఆర్బీఐ బ్యాంక్‌లకు లేఖలు రాస్తా : రఘురామ

ఏపీలో ఆర్థిక విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుందని. వీటిపై ప్రధాని, ఆర్బీఐ బ్యాంక్‌లకు లేఖలు రాస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తెస్తున్నారని అన్నారు. దేశంలో ఇంతలా అప్పులు చేస్తున్న రాష్ట్రం ఏపీ తప్ప మరొకటి లేదన్నారు. కార్పొరేషన్‌ ద్వారా అప్పులు ఇచ్చి ప్రజలను బలిపశువులు చేయొద్దని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు మాత్రమే అప్పులు ఇవ్వాలన్నారు. కాగ్‌ సహితం అప్పులపై తలలు పట్టుకొని ఏపీని వదిలేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img