Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రధాని మోదీతో కలిసి సీఎం జగన్‌ లంచ్‌.. చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బాబు పరాన్న జీవి అంటూ విమర్శించారు. ఇటీవల చంద్రబాబుకు ఢల్లీి నుంచి పిలుపువచ్చిన విషయం తెలిసిందే. దిల్లీలో పర్యటించిన చంద్రబాబుతో ప్రధాని మోడీ ముచ్చటించారు. అనంతరం జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోడీ.. సీఎం జగన్‌తో కూడా ముచ్చటించారు. ఏకంగా ప్రధాని మోదీ కూర్చున్న లంచ్‌ టేబుల్‌పై భోజనం చేసే సీఎం జగన్‌కు అవకాశం లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో మోడీ పలు విషయాలపై మాట్లాడారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ.. రెండు నిమిషాలు మాట్లాడితేనే చంద్రబాబు ఎంతో ప్రచారం చేసుకున్నారని.. అదే మోడీతో సీఎం జగన్‌ లంచ్‌ చేశారంటూ పేర్కొన్నారు. ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు అంటూ విమర్శించారు.‘‘నీతీ ఆయోగ్‌ సమావేశం లంచ్‌ విందులో ప్రధాని టేబుల్‌ నెంబర్‌:1 కు ఆహ్వానితులుగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒకరు.
కాకపోతే, గంటకు పైగా ఒకే టేబుల్‌ దగ్గర లంచ్‌ విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్‌గారి స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు అయిదు గంటలకు సరిపడ కట్టుకథ అల్లిన బాబు ఆయన పచ్చకులమీడియా స్థాయి ఎక్కడ? ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు.., 1994లో వెన్నుపోటుతో అధికారం లాక్కుని, 1999లో కార్గిల్‌ యుద్ధం వల్ల, 2014లో మోదీ గారి హవాలో అధికారంలోకి రావడం తప్పితే… సొంతంగా ఒక్కసారి కూడా గెలిచింది లేదు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని ఇంగ్లీషులో ‘పేరసైట్స్‌’ అంటారని, అంటే ‘పరాన్నజీవులు’ అని వివరించారు. ‘‘ఢల్లీిలోని అన్ని పార్టీల ఇళ్లలో తిని, అందరి వాసాలు లెక్కపెట్టిన ఈ చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా ‘మళ్లీ కలుద్దాం, మా ఇంటికి రండి’ అని ఎందుకు అంటారు?’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img