Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితమే ప్రధాని మోడీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్బంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. అలాగే మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఆర్‌.కే.సింగ్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్ల విద్యుత్‌ బకాయిలపై చర్చించే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img