విశాలాంధ్ర- ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రావడాని నిరసిస్తూ శుక్రవారం ఉరవకొండ సీపీఐ తాలూకా కార్యదర్శి జే.మల్లికార్జున సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లజండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 32 మంది బలి దానాల తర్వాత స్థాపించిన విశాఖ ఉక్కు పరిశ్రమను ను ప్రైవేటికరణ పేరుతో అదానికి దారాధత్తం చేసిన మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మొకరిల్లి 3 లక్షల మందితో స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చెయ్యడం సిగ్గుచేటన్నారు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు ఏమి చేశారని స్వాగతం పలుకుతున్నారని ప్రశ్నించారు ప్రత్యేకహోదా, విభజనహామీలును అమలు చేయడంలో ప్రధాని పూర్తిగా విఫలం చెందారన్నారు ప్రధాని, మోదీ మరియు ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు కూడా ప్రజా కార్మిక వ్యతిరేక అవలంబిస్తున్నారని అందుకే ఈ నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున, వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్ వీరితోపాటు సీపీఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.