ఏపీ ప్రభుత్వ వార్షిక బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి, మండలిలో మంత్రి సిదిరి అప్పలరాజు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కన్నబాబు, మండలిలో వేణుగోపాలకృష్ణ ప్రవేశపెడుతున్నారు.