రోడ్ల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 27న డీజీపీకి శ్రమదానం కార్యక్రమం విషయం తెలిపామని, రాజమండ్రి అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీలకు కూడా సమాచారం ఇచ్చామని చెప్పారు. శ్రమదానంలో పాల్గొనకుండా మా కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈ దుస్థితి నెలకొందని అన్నారు.