రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదు
అమరావతి జేఏసీ
మూడు రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని , అసెంబ్లీ, హైకోర్టు అన్నీ ఇక్కడే ఉండాలన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మార్చుకుని ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఏ ప్రభుత్వమైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఆగదని, రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.