ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు ఏమి తెలుసునని అంటూ కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు చింతామోహన్ మండిపడ్డారు. కాంగ్రెస్పై పీకే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్ కిషోర్ డబ్బు మనిషని అన్నారు. పీకే జర్నలిస్టులను పక్కన పెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చూడటానికి చిన్నగా కనిపించవచ్చు కానీ గొప్ప నాయకుడని అన్నారు. కాంగ్రెస్ గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడమేంటని మండిపడ్డారు.