సంక్రాంతి పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీల పెంపు సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు హైదరాబాద్ – విజయవాడకు రూ.3వేలు, హైదరాబాద్ – విశాఖకు రూ.5వేలు చార్జీలను వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు. తెలంగాణ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలను పెంచలేదని..తెలంగాణ తరహాలో ఏపీఎస్ఆర్టీసీలో కూడా సాధారణ చార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల దోపిడీని నియంత్రించాలని కోరారు.