మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు కిడ్నీలో రాళ్లు ఉండటంతో వైద్యులు సర్జరీ చేశారు. నాని కోలుకున్నారని.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని చెబుతున్నారు. రెండు వారాల పాటూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. కొడాలి నాని మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నట్లు తెలుస్తోంది.