Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఫీజులు పెరుగుతాయంటూ తప్పుడు ఆరోపణ చేస్తున్నారు

: ఆదిమూలపు సురేష్‌
చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఎయిడెడ్‌ విద్యాసంస్థల గురించి ఆలోచించారా..?. ఈ రోజు వచ్చి తండ్రీ, కొడుకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పమనండి. టీచర్లను ప్రభుత్వంలోకి తీసుకోవడం వల్ల వారు ఆనందంగా ఉన్నారు. ఆయా సంస్థలు ప్రభుత్వంలో కలవాలా వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేశాం. ఇక అందులో సమస్య ఏముంది..?.అని అన్నారు.అనంతపురం సంఘటనలో రాళ్లు వేసింది ఎవరు? విద్యార్థిని స్పష్టంగా రాళ్లు వేశారని చెప్తుంటే లాఠీచార్జి అంటారేంటి..? అని అన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్న తరుణంలో ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. ఫీజులు పెరుగుతాయంటూ తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఎలా పెరుగుతాయో చెప్పండి కావాలంటే నేను చర్చకు సిద్ధం అని అన్నారు. వీళ్లెన్ని చేసినా విద్యా వ్యవస్థలో అందరికీ న్యాయం జరిగే దిశగా చర్యలుంటాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img