దక్షిణ మధ్య బంగాళాఖాతం. హిందూమహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిరది. గురువారం మధ్యాహ్నానికి ఇది అల్పపీడనంగా మారి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 45 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.