బంగాళాఖాతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు తీరప్రాంతాల్లో, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. తమిళనాడులో తిరువన్మియూర్, ఆళ్వార్పేట్, చెన్నైలోని సుముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనలు వచ్చాయని వచ్చినట్లు ట్వీట్లలో పేర్కొన్నారు.