Friday, April 19, 2024
Friday, April 19, 2024

బంగాళాఖాతంలో మరో వాయుగుండం

‘జవాద్‌’ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్న తరుణంలో వచ్చేవారం మరో అల్పపీడనం వాయుగుండంగా మారనున్నదని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు.అండమాన్‌ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రం ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిరది. శనివారం ఉదయం ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. శనివారం కన్నియా కుమారి, తిరునల్వేలి, సేలం, ఈరోడ్‌, నామక్కల్‌, తిరుప్పూరు జిల్లాల్లో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ పరిస్థితులలో బంగాళాఖాతంలో ఈ నెల రెండోవారం అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వాయుగుండం ఏ దిశగా కదులుతుందన్న విషయంపై వాతావరణ పరిశోధన నిపుణులు పరిశీలన జరుపనున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img