కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ పై చంద్రబాబు మాట్లాడుతూ,రైతులు, పేదల కోసం కేంద్రం ఏం చేస్తుందనేది బడ్జెట్లో చెప్పలేదన్నారు. నదుల అనుసంధానంపై ప్రణాళికలు స్వాగతిస్తున్నామన్నారు. వేతన జీవులకు మొండిచేయి చూపారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో వైస్సార్సీపీ విఫలమైందన్నారు. 28మంది వైస్సార్సీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.