కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో మొత్తం ఓట్లలో దాదాపు 90 వేలు దొంగఓట్లని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉపఎన్నికలో మొత్తం లక్షా 46వేల 562 ఓట్లు పోలయ్యాయని.. అందులో ప్రజలు 40 శాతం ఓట్లు వేశారని, దొంగఓట్లు 60 శాతమని అన్నారు. అధికారపార్టీ నేతలు ఓటుకు రూ. 500 ఇచ్చారన్నారు. చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ బలహీనంగా ఉన్నాయని దానికి తోడు అధికారపార్టీ కక్షలు, కేసులతో బెదిరింపులకు గురిచేసిందని, ప్రజలు స్వచ్చంధంగా ఓటు వేసే పరిస్థితి లేదని అన్నారు. కాగా బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీ సాధించారు.