ఏపీలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది.. మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో సమావేశమైన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. చివరికి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలో కొందరు నేతల తీరుతోనే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగా లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నామంటున్నారు. కన్నాతో పాటు తన ముఖ్య అనుచరులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు.కన్నా ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటూ ఎంపీ జీవీఎల్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. జీవీఎల్ కాపులకు ఏం చేశారని సన్మానం చేశారని ప్రశ్నించారు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలోకి వెళతారనే చర్చ మొదలైంది. అయితే జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.