మంత్రి పదవుల కోసం కన్నీరు పెట్టుకున్న వైసీపీ నాయకులు ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని నాగబాబు విమర్శలు చేశారు. బుజ్జగింపుల పర్వంపై నాగబాబు సెటైర్స్ వేశారు. వైసీపీలో ఓదార్పుల పర్వం మొదలైంది. మంత్రి పదవులు రాకపోవడంతో పలువురు నేతలు అలిగారు మరికొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మాజీ మంత్రి బాలినేనిని ప్రభుత్వ సలహాదారు ఏకంగా మూడుసార్లు కలిసి బుజ్జగించారు. చివరికి సీఎం జగన్తో భేటీ కావాలని కోరారు. మాజీ హోంమంత్రి సుచరిత అయితే మరో అడుగు ముందుకేసి రాజీనామాకు సిద్ధమయ్యారు. మంత్రి పదవులు దక్కలేదని ఇంతగా బాధపడటం..తనకూ చాలా బాధగా అనిపించిందని, ‘అయితే కౌలు రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగ అవకాశాలు రాని యువత, రాజధాని ప్రజల కడుపు మంట, ఉద్యోగులు పడుతున్న బాధలు, పట్ల ఇదేరకమైన కన్నీరు, బాధ, వాళ్లపై ప్రేమలాంటివి చూపిస్తే బాగుంటుందంటూ నాగబాబు వైసీపీ నేతలకు చురకలు అంటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు.