Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బొజ్జల మరణం అత్యంత బాధాకరం : చంద్రబాబు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సంతాపం ప్రకటించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబు… బొజ్జల మరణించే సమయానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. బొజ్జల మృతి వార్త తెలిసినంతనే తీవ్ర ఆవేదనకు గురైన చంద్రబాబు… బొజ్జల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. లాయర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన బొజ్జల..ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు బొజ్జల నిత్యం అందుబాటులో ఉండేవారని తెలిపారు. బొజ్జల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించిన చంద్రబాబు.. బొజ్జల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img