తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో తెల్లవారుఝాము నుంచే భక్తులు పోటెత్తారు.. కృష్ణానదిలో స్నానమాచరించి భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.. అన్ని శివాలయాలలో ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.