పవన్ లాంటి నిబద్ధత కలిగిన నాయకుడు మనకు రావాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఆయన మాట్లాడుతూ, తమ్ముడి పాలిటిక్స్ పై అన్నయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తాను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయి సైలెంట్ గా ఉన్నానన్నారు. ప్రస్తుత నాయకులపై ఎలాంటి సెటైర్లు వేయలేదన్నారు. పవన్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తాను రాజకీయాల నుంచి బయటకు రావడం..పవన్ కు ఉపయోగపడుతుందన్నారు. పవన్ కు ప్రజలు అధికారం ఇచ్చే రోజు రావాలన్నారు.