ఎంపీ రఘురామ కృష్ణంరాజు
రాజధాని అంశంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ బుద్ధిలేని, మతిలేని ప్రకటన చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. మంత్రి మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. మంత్రి బొత్స అనుకున్నట్లు రాజధాని విశాఖ వెళ్ళడం అయ్యే పని కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.మంత్రి బొత్స మాటలు పట్టించుకోవద్దని అమరావతి రైతులు, మహిళలను కోరుతున్నానన్నారు. సీఎం జగన్ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా మంత్రి ఇలానే మాట్లాడుతుంటారని అన్నారు.