Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మచిలీపట్నంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

కోట్లాది రూపాయాల విలువచేసే ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడంపై కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యాలయ స్థలాన్ని కొల్లు రవీంద్ర మీడియాకు చూపే ప్రయత్నం చేశారు. దీంతో కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. బల్లయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీస్‌ చర్యలను కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిగటించారు. కొల్లు రవీంద్రను అరెస్టు చేసి గూడూరు వైపు పోలీస్‌ తరలించారు. దీంతో మచిలీపట్నం లక్ష్మీటాకీస్‌ సెంటర్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img