Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుంది

తక్కువ ధరకే వివాదాలు లేని ప్లాట్లను అందిస్తాం : సీఎం జగన్‌
ఏపీలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీనికిసంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు.మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్‌ ధర కంటే తక్కువకే మధ్యతరగతి ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మోసం చేయకుండా ఉండేలా లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని చెప్పారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని సీఎం తెలిపారు. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. మొత్తం సొమ్ము నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. చెల్లింపు పూర్తయిన వెంటనే ప్లాట్లు అందజేయడం జరుగుతుందన్నారు. పదిశాతం ముందుగా చెల్లిస్తే ఇంటి నిర్మాణం చేస్తామన్నారు. వాయిదాల్లో మిగతా సొమ్ము చెల్లింపు చేయవచ్చునన్నారు. అయితే డబ్బులు మొత్తం ముందుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేట్‌ కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img