Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్‌ కలకలం

పాడేరులో ఏడుగురు చిన్నారుల్లో కనిపించిన లక్షణాలు
మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌ లక్ష్మీపురం పంచాయతీలోని దొరగుడ గ్రామంలో పలువురు చిన్నారులు ఈ వ్యాధి బారినపడ్డారు. ఆంత్రాక్స్‌తో చనిపోయిన మేక మాంసాన్ని తిన్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వ్యాధి బారినపడిన ఏడుగురు చిన్నారులు 5 నుంచి 13 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు. బాధిత చిన్నారుల శరీరంపై పొక్కులు, కురుపులు వచ్చినట్టు చెప్పారు. ఇక్కడ చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని, వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని వైద్యులు వివరించారు. పాడేరు డివిజన్‌లో గతంలోనూ ఆంత్రాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. ఆంత్రాక్స్‌ వ్యాధి ఒక ప్రాంతంలో ఒకసారి వ్యాపిస్తే 60 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ వ్యాధితో చనిపోయిన జీవాల మృతకళేబరాలను పూర్తిగా పూడ్చాలి. వాటిని సరిగా పూడ్చకపోతే వాటి నుంచి సూక్ష్మక్రిములు బయటకు వచ్చి నేలలో ఏళ్ల తరబడి ఉండిపోతాయి. ఆపై ఆ ప్రాంతంలోని నీరు, గాలి, గడ్డి ద్వారా పరిసరాల్లోని మనుషులు, పశువులకు వ్యాపిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img