ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ప్రధానంగా ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కోస్తా బంగ్లాదేశ్ మరియు దానిని అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో తీవ్రంగా మారిందని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది.