Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మహానటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు

మహానటుడు, ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించారని, ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్‌ ఆద్యుడు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. జాతీయ రాజకీయాలకు ఎన్టీఆర్‌ సరికొత్త దిశా నిర్దేశం చేశారని, సంక్షేమ పథకాలతో సమసమాజ స్థాపనకు ఎన్టీఆర్‌ బాటలు వేశారన్నారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు మనందరం కృషి చేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు వారి కోసం ఎన్టీఆర్‌ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img