టీడీపీ చేపట్టిన మహానాడు కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది. మహానాడు ముగింపు సందర్భంగా తలపెట్టిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. దీంతో చంద్రబాబు నాయుడు ఐదు కిలోమీటర్ల దూరంలోని గెస్ట్ హౌస్ నుంచి సభా ప్రాంగణానికి చేరుకోవడానికి 45 నిమిషాల సమయం పట్టింది. తెలుగు దేశం పార్టీ ఒంగోలులో చేపట్టిన మహానాడు కార్యక్రమానికి కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. మహానాడు ముగింపు సభ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహానాడు రెండో రోజు సాయంత్రం సభలో పాల్గొనడం కోసం ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబు నాయుడు బయల్దేరారు. కానీ ఈ సభకోసం మహానాడు ప్రాంగణానికి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. దీంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి సభా ప్రాంగణానికి రావడానికి 45 నిమిషాలు సమయం పట్టింది. వేదిక వద్ద ఉన్న జనంతోపాటు.. బయట కూడా వేలాది మంది జనం ఒంగోలులో వేచి ఉన్నారు. పోలీసు ఎస్కార్ట్ మధ్య చంద్రబాబును సభా ప్రాంగణానికి తీసుకెళ్లారు.