Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళలపై భౌతిక దాడుల్లో మొదటి స్థానంలో ఏపీ : ఎంపీ రఘురామకృష్ణరాజు

రాష్ట్రంలో 3 హత్యలు, 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందని, లేని చట్టాల గురించి తమ పార్టీ నేతలు మాట్లాడతారనీ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడిస్తోందని ఆయన చెప్పారు. మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8 వ స్థానంలో ఉందని,పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇక మహిళలపై భౌతిక దాడుల్లో మొదటి స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 2019తో పోలిస్తే..రాష్ట్రంలో 63 శాతం మేర నేరాలు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రతి 3 గంటలకు ఎస్సీలపై ఓ దాడి జరుగుతోందన్నారు. 2021లో అత్యధిక లాకప్‌ డెత్‌లు ఏపీలోనే నమోదయ్యాయని, తన అదృష్టం బాగుండి పోలీసుల కస్టడీ నుంచి ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img