Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మాండూస్‌ ఎఫెక్ట్‌.. తిరుమలలో భారీ వర్షాలు..

తిరుమల, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తిలో ఈదురుగాలులు, పలు చోట్ల చెట్లు, హోర్డింగులు నేలకూలాయి. మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను అధికారులు మూసివేయించారు. క్రేన్లు, ఆటో క్లీనిక్‌ వాహనాలను టీటీడీ సిద్ధం చేసింది. భారీ వర్షాలకు తీరుమలలోని డ్యామ్‌లు పూర్తిగా నిండిపోయాయి. తూపిలిపిపాలెం బీచ్‌ దగ్గర 10మీ సముద్రం ముందుకొచ్చింది. సముద్ర తీర ప్రాంతాలకు ఎవరు వెల్లవద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img