వైసీపీ అరాచకాలపై ఇన్నాళ్లు ఓపికతో ఉన్నామని, ఇక సహించబోమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షాస్థలి వద్ద సునీత మాట్లాడారు. ‘పరిటాల రవిని హత్య చేసినవాళ్ళు రోడ్లపై తిరుగుతున్నా గొడవ పెట్టుకోలేదని, చంద్రబాబుపై ఉన్న గౌరవంతో సహనం ఉన్నామన్నారు. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండేవారు కాదని అన్నారు.చంద్రబాబు తీరు మారాలని తెలిపారు.‘ ఇప్పుడు మా రక్తం ఉడికిపోతుంది. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఒక్క గంటసేపు కళ్లు మూసుకుంటే చాలు..’ అని అన్నారు. వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ‘మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఊ..అంటే మంత్రులను తిరనివ్వమని అన్నారు. మాకూ బీపీ వస్తోంది..ఏం చేస్తామో త్వరలో చేసి చూపిస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.