విశాలాంధ్ర ` కళ్యాణదుర్గం : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం చేపట్టిన ఇదేమి కర్మ కార్యక్రమాల్ని అడ్డుకొని పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యాలయాలపై విధ్వంసకాండ సృష్టించిన వైసీపీ గుండాలను అరెస్టు చేయాలంటూ కళ్యాణదుర్గంలో టిడిపి శ్రేణులు నిరసన కార్యక్రమం చేశారు. శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక నియోజకవర్గ ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి గుండారాజ్యం పోవాలంటూ నినాదాలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో పట్టణం పోలీస్ స్టేషన్ ముట్టడిరచారు . వైసీపీ గుండాలను అరెస్ట్ చేయాలని స్థానిక సీఐ కు వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించి సొంత పూచీ కత్తు పై విడుదల చేశారు.