Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులుపై కేసు నమోదు


మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులుపై అనంతపురం జిల్లా, బొమ్మనహళ్లి పోలీసులు కేసు పెట్టారు.పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాల్వ శ్రీనివాసులు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ కాల్వ శ్రీనివాసులుతోపాటు 151 మంది టీడీపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్వ శ్రీనివాసులుపై బొమ్మనహళ్లి ఎస్‌ఐ రమణారెడ్డి సుమోటోగా కేసు నమోదు చేశారు. కాగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img