మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు బెయిల్ పొడగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ను మరో ఆరు వారాలకు పొడిగించింది. పదవ తరగతి పరీక్ష పత్రాల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు బెయిల్ రాగా.. ప్రస్తుతం కోర్టు మరో ఆరు వారాలకు బెయిల్ను పొడిగించింది.