Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మాజీ హోంమంత్రి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విశాలాంధ్ర – యస్. రాయవరం: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో యస్. రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో మాజీ హోంమంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నిమ్మకాయల చినరాజప్ప ర్యాలీ ను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుకోసం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో యస్. రాయవరం వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో పోలీసులు తీరు పట్ల మాజీ హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులతో అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. ర్యాలీ ను ముందుకు వెళ్లనియకపోవడంతో దగ్గరలోని ఉన్న దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెలుగు దేశం పార్టీ నాయకులు వినోదురాజు, వెంకటరాజు, కాశీనాయుడు, చిట్టిబాబు,గుర్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img