Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మార్కాపురం ఏరియా వైద్యశాలలో పసికందు మాయం

ప్రకాశంలో జిల్లాలోని మార్కాపురం ఏరియా వైద్యశాలలో నాలుగు రోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా కారంపూడి సమీపంలోని బట్టువారిపల్లికి చెందిన శ్రీరాములు నాలుగు రోజుల క్రితం తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచారు. శ్రీ రాములు భోజనం కోసం బయటకు వెళ్లి వచ్చిన తర్వాత పాప కనిపించడం లేదంటూ వైద్య సిబ్బంది తెలిపారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా పోలీసులు, పాపను ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img