Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులు అవసరం


మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌
రాబోయే రోజుల్లో డిగ్రీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు విద్యార్థులతో ‘ఇంటర్న్‌ షిప్‌’ని చేయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. బుధవారం ఆయన నూజివీడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నత విద్యాలయాల్లో ఉన్న కోర్సులను మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత రెండేళ్లలో విద్యావిధానంలో చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయన్నారు. నూజివీడులో ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయెట్‌ సెంటర్‌ను అటామనస్‌ ఇనిస్టిట్యూట్‌గా గుర్తించి యూనివర్సిటీతో సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తి హోదాతో అభివృద్ధి చేయాలని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img