ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.