డీజీపీ గౌతమ్ సవాంగ్
మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరువైందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. గత రెండేళ్లుగా అనేక సంక్షేమ పథకాలు గిరిజనులకు అందుతున్నాయన్నారు. ఏఓబీ సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు.